KMM: పెరుగుతున్న సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా చెరువును నింపేందుకు ఉన్న సాంకేతిక అవకాశాలను, కాలువల ప్రస్తుత స్థితిగతులను అధికారులు నిశితంగా పరిశీలించారు. ముదిగొండ మండలంలోని ముత్తారం పల్లె చెరువుకు ఎన్ఎస్పీ జలాలను మళ్లించేందుకు ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.