KMM: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశించారు. మధిర మండలం చిలుకూరు వద్ద గల అంతర్రాష్ట్ర పోలీస్ చెక్పోస్ట్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ రికార్డులను పరిశీలించి, వాహన సోదాల్లో వేగం పెంచాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.