శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి మైదానంలో ఈనెల 15న జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ దేవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు జనన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.