BPT: పిట్టలవానిపాలెంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నాయని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.