BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుక శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కుమ్మర మొల్లమాంబ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాయణాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా రచించిన ధన్యజీవి మొల్ల అని కొనియాడారు.