WNP: గురువు వద్ద విద్యనభ్యసించకపోయినా, భగవత్ కృపతో తెలుగు సాహిత్యంలో తొలి మహా రచయిత్రిగా ఎదిగిన మొల్ల స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరం అని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల 586వ జయంతిని ఘనంగా నిర్వహించారు.