MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జన్నారంలో సంతకాల సేకరణ ప్రారంభమైంది. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో సమితి నాయకులు ప్రజలను, ప్రముఖులను కలుస్తూ సంతకాలను సేకరించారు. వారు మాట్లాడుతూ.. హిందువులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు కొండా నరేష్, ఎర్రం నరేష్, గోలి చందు, దండవేణి శ్రీధర్ ఉన్నారు.