PDPL: ధర్మారం మండలం కటికనపల్లిలో విద్యుత్ షాక్తో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బొజ్జ అభిరాం (6) అనే బాలుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అన్నం తిని, పక్కనగల బల్ల కుమార్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా చేతికి ఎర్త్ వైర్ తగిలి ప్రమాదవశాత్తు మరణించాడు. తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.