PLD: మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో పిడుగురాళ్ల-హైదరాబాద్ రహదారిపై రవాణా శాఖ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. డీటీవో సంజీవరావు, ఆర్టీవో కృష్ణ ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా బస్సుల్లో ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్’ సౌకర్యంపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై వలితో సిబ్బంది పాల్గొన్నారు.