PLD: రెంటచింతల హోసన్నా మందిరం వద్ద ప్రమాదం జరిగింది. దోర్నాల నుంచి గురజాల మండలానికి మొక్కజొన్న కండేలు కోయడానికి వెళ్తున్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 25 మంది కూలీలలో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే గురజాల ఆసుపత్రికి తరలించారు.