WG: పాలకోడేరు మండలం గోరగనమూడిలో రూ. 82 లక్షల వ్యయంతో నిర్మించిన 2 కిలోమీటర్ల రూరల్ కనెక్టివిటీ సీసీ రోడ్డును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రాజు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.