ప్రకాశం: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి స్ఫూర్తితో నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.