కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా నడిపిస్తోందని గుంటూరు పశ్చిమ MLA గళ్ళా మాధవి తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ పరిధికి రూ.604 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.