కృష్ణా: ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ మండలం వేకనూరులో ఎంవీ కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా తరువాత గుండె, మెదడు సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.