SS: కదిరి పట్టణం తుమ్మల రోడ్డు అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. భక్తి భావంతో నిర్మించే ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.