SRPT: ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించే ‘అరైవ్-అలైవ్’ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 32 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఉన్నారు.