కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి కొరత వల్ల ఎటు వంటి ఇబ్బంది కలగకూడదని ఆమె స్పష్టం చేశారు.