తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో వేసవి దృష్ట్యా ప్రజల కోసం చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా.ప్రమీల దేవి సూచనలతో, ఇంఛార్జ్ సూపరింటెండెంట్ డా.నిర్మలాదేవి సహకారంతో సివిల్ సర్జన్ డా. రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాత శ్రీ పెడమాళ్ల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.