CTR: చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కన నిర్మాణంలో కొనసాగుతున్న జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయ భవన పనులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ,పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీకి నివేదించాలని ఆదేశించారు.