ATP: గుత్తి మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా సిబ్బందికి హోం కంపోస్ట్ తయారుచేయుటకు గురువారం మెటీరియల్ను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మెప్మా సిబ్బందికి హోం కంపోస్ట్ తయారు చేయడానికి ఈ మెటీరియల్ను అందజేశామన్నారు.