W.G: వేసవి నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని నరసాపురం ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు. ఈ సందర్భంగా RDO ఆచంట మండలం కోడేరులో పర్యటించారు. జల జీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం, బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణానికి సంబంధించిన స్థలాలను ఆయన పరిశీలించారు.