SS: గుడిబండ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రకాల దస్త్రాలను పరిశీలించి వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. సకాలంలో కేసులను పరిష్కరించి అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ASR: జీ.మాడుగుల మండలంలోని కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో 22 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మగు, జగదీశ్వరరావుకు చెందిన ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ATP: అనంతపురంలో నిర్వహించిన అనంత బాలోత్సవం కార్యక్రమంలో గుత్తి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషా, గైడ్ రాధికా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఇలాగే ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
ASR: అడ్డతీగల మండలం దుచ్చెత్తి శివారులో పేకాట కేంద్రంపై దాడి చేసి ఆరుగురు పేకాట రాయళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకయ్య మంగళవారం తెలిపారు. వీరి నుంచి రూ.8,600 నగదు స్వాధీన పరుచుకున్నామన్నారు. దుచ్చెత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, కోడిపందాలు, జూదం నిర్వహించిన, ఆడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
AKP: నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వరకు, అక్కడి నుంచి వెదుళ్లపాలెం వరకు 100 బైక్లతో మంగళవారం పోలీసులు ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు.
ATP: గుత్తి పట్టణ శివారులోని గేట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి ఎస్సై ఆశా బేగం మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రొజెక్టర్పై సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ జగదీష్ వివరిస్తున్న వీడియోను విద్యార్థులకు ప్రదర్శించారు.
MNCL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 డీ6 ప్రకారం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
GNTR: జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఈ విధంగా ఎండలు ఉండగా.. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మధ్యాహ్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
NRML: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదల కోరుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను దిలావర్పూర్ మండల కేంద్ర ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం రెండవసారి అవకాశం ఇవ్వగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ స్వాతిని కలిసి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని తెలిపారు. తమ వివరాలు ఇస్తామని పేర్కొన్నారు.
NDL: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల విలేఖరి రామారావుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య, బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
MHBD: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీలు శోభకు పూలకుండి అందించి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.
మంచిర్యాల: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో RO ప్లాంట్ ఆలనాపాలన కరువైంది. ప్లాంట్ చెడిపోయి నెల రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. చల్లటి శుద్ధి జలాన్ని అందించే ఆర్వో ప్లాంట్ సేవలకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది రోగులు దూరమయ్యారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి RO ప్లాంట్ బాగు చేయించాలని కోరుతున్నారు.
NRML: ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారి మన్ననలు పొందాలని ఆదిలాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఆధ్వర్యంలో పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కృష్ణా: విజయవాడ గాంధీనగర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వంశీతో ములాఖత్ కానున్న నేపథ్యంలో పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అయితే మద్యం మత్తులో ఓ వ్యక్తి రాయితో తలపై కొట్టుకున్నాడు. గేట్లు తెరవాలని హల్ చల్ చేశాడు. దీంతో మందు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.
GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామం విశ్వభారతి ఫార్మసీ కాలేజీలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని అధ్యాపకులను కోరారు.