ASF: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
AP: రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఫలితాలను resultsbie.ap.gov.inలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పొత్తులు, కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
TG: అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని మాజీమంత్రి KTR అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘రూ.10వేల కోట్ల స్కామ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత కుట్ర. త్రీడీ మంత్రంతో సర్కార్ పాలన చేస్తోంది. మోసం, విధ్వంసం, డైవర్షన్ చేయటమే కాంగ్రెస్ విధానం. కంచ గచ్చిబౌలిలో పర్యావరణ హననం చేసింది’ అని మండిపడ్డారు.
VZM: చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస గ్రామంలో వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
KMM: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. శిరీష భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని CM ఆకాంక్షించారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.
PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన మహాలక్ష్మమ్మ పనులు చేసుకొని ఆ వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఆమెకు తెలియకుండా ఎవరో బ్యాంక్ ఖాతా నుంచి నాలుగు విడతలుగా రూ.31వేల నగదు బదిలీ చేసుకున్నారు. గురువారం కొంత డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్కు వచ్చి ఖాతాలో ఎంత ఉన్నాయని వివరించగా, ఖాతాలో నగదు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: ఆగిరిపల్లి మండలం వడ్లమాను రైతు సింహాద్రి జగన్మోహనరావు తన కుమారుని వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగా, బైకు చోరీ జరిగిందని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పెదవుటుపల్లి పిన్నమనేని ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్ళగా, పార్కింగ్ చేసిన బైక్ను అగంతకుడు దర్జాగా చోరీ చేసి వెళ్లిన సంఘటన సీసీ ఫుటేజ్లో రికార్డయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, పెన్షన్లు మంజూరు చేసి పేదల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లెలోని వారి నివాసంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
అన్నమయ్య: మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని చేయాలంటూ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు డీఎస్పీ కొండయ్య నాయుడులను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వాల్మీకిపురం మండలానికి చెందిన మాజీ సైనికుడు వెంకటాద్రి భూమి కబ్జాకు గురి కావడంతో మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి న్యాయం చేయాలని కోరారు.
NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వాహకులు సూర్య ప్రకాష్ రావు తెలిపారు. 12న శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 13న ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, 14న సోమవారం బండ్ల ఊరేగింపు, 15న మంగళవారం ఉత్సవ మూర్తుల ఊరేగింపు, అమృత స్నానాలు నిర్వహించనున్నారు.
వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.
HYD: తడి, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి స్వచ్ఛ ఆటోలోకి ఇవ్వాలని ప్రజలకు కమీషనర్ శరత్ చంద్ర అవగాహన కల్పించారు. ఈ రోజు బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ భైరాగిగూడలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం నిషేధమని స్వచ్ఛ బండ్లగూడ జాగీర్ కొరకు సహకరించాలని తెలిపారు.
NLR: బీజేపీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యుల సమావేశం స్థానిక ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చర్చించుకున్నారు.