KNR: విద్యుత్ మెటీరియల్ సేకరణలో ఇకపై కాగిత రహిత (పేపర్స్) విధానం అమలులోకి వచ్చినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. గతంలో మెటీరియల్ కోసం పలు దశల పేపర్ ప్రక్రియ ఉండేదని, ఇప్పుడు ‘ఈ-స్టోర్’ ద్వారా ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయి సిబ్బందికి పని సులభతరమై, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.