HYD: తాజ్ కృష్ణా హోటల్లో MRDCL ఆధ్వర్యంలో నేడు ‘MUSI INVITES’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారన్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.