MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉగాది పండుగను నిర్వహించుకున్నారు. ఉగాది సందర్భంగా గురువారం జన్నారంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాలను భక్తులు, ప్రజలు సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు ప్రజలకు ఉగాది పచ్చడిని అందజేశారు.