NLG: వేసవి ఎండలు ముదురుతుండడంతో హాలియా పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బోండాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన విక్రయాలు జోరుగా సాగుతుండగా, ఒక్కో బోండా ధర రూ.30 నుంచి 50 పలుకుతోంది. లీటర్ బాటిల్ కొబ్బరి నీరు రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచించడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.