మంచిర్యాల జిల్లాలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులం కలిసి రెవెన్యూ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశామని రెవెన్యూ సంఘం నాయకులు శ్రీనివాస్ రావు దేశ్ పాండే ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీలలో మంచిర్యాల ఉషోదయ స్కూల్ మైదానంలో క్రికెట్ పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.