NLR: కూటమి పాలనలో సంక్షేమం కరువైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం గొట్లపాలెం, పిడూరులో ఆయన పర్యటించారు. చంద్రబాబుకు అమరావతిలో దోపిడీ తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. ఎన్నికలకు ముందు సూపర్-6 వంటి హామీలు ఇచ్చి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని విమర్శించారు.