SKLM: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని లావేరు పోలీసులు అరెస్ట్ చేశారు. లావేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న అబ్దుల్ రవూఫ్ను తనిఖీ చేయగా, అతని నుంచి 7.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అవతారం గురువారం సాయంత్రం తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.