E.G: ధవలేశ్వరం PS పరిధిలోని టిడ్కో ఇళ్ల వద్ద గురువారం రాత్రి CI టి. గణేశ్ సిబ్బందితో కలిసి ‘పల్లెనిద్ర’ నిర్వహించారు. వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సీఐ పేర్కొన్నారు.