TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో ఇవాళ పర్యటించనున్నారు. తుంబూరులో తారురోడ్డు ప్రారంభోత్సవం, నారాయణవనంలో క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమం, పిచ్చాటూరులో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నాగలాపురంలో ‘అన్నదాత సుఖీభవ’ మెగా చెక్కు పంపిణీ చేసి, వెంబాకంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.