AKP: అచ్యుతాపురం మండలం చోడపల్లిలో వేంచేసియున్న చోడమాంబ అమ్మవారి పండగను ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు గురువారం తెలిపారు. పండగలో భాగంగా ఈనెల 23న అమ్మవారి పుట్టుక ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.