ADB: ప్రజలందరూ పండుగలను శాంతి సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గురువారం బోథ్ మండలంలోని జామ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యంగా జీవించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.