NLR: జిల్లాలో అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం అధికారులను ఆదేశించారు. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.3,063.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.