• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. సామాగ్రి దగ్ధం

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని ఇప్ప లత ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సామాగ్రి కాలిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టలు, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిజ్, రూ.50వేలు, అర తులం బంగారం, కుమారుడి స్టడీ సర్టిఫికెట్స్ కాలి బూడిద అయ్యాయన్నారు. అధికారులు స్పందించి నిరుపేదలమైన తమకు సాయం చేయాలని వేడుకున్నారు.

February 24, 2026 / 09:09 AM IST

చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

HYD: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

February 24, 2026 / 09:08 AM IST

బాలానగర్ HAL ఉద్యోగులకు క్షయ, షుగర్ పరీక్షలు

MDCL: జిల్లా వ్యాప్తంగా జీరో టీబీ లక్ష్యంగా DTO అధికారిక యంత్రం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగానే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉద్యోగులకు క్షయ, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొంది. అత్యధిక టెక్నాలజీతో కూడిన ఏఐ ఎక్స్ రే ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించడం జరుగుతుందని డాక్టర్ సంధ్య పేర్కొన్నారు.

February 24, 2026 / 09:08 AM IST

పీజీఆర్ఎస్ కు 127 అర్జీలు

SKLM: అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. 127 అర్జీలు ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ , గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

February 24, 2026 / 09:06 AM IST

564 పోస్టులు.. మంత్రివర్గం ఆమోదం

TG: వైద్యారోగ్యశాఖలో 434 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఒక్కోదానికి 31 చొప్పున పోస్టులున్నాయి. వైద్యారోగ్య నియామక మండలి భర్తీ చేయనుంది. వీటితో పాటు జలమండలికి 130 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో మేనేజర్, ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటిని TGPSC ద్వారా భర్తీ చేస్తారు.

February 24, 2026 / 09:06 AM IST

రైల్వే స్టేషన్ వద్ద వృద్ధుడి మృతి

నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు CI నంబర్ 91211 01088కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 24, 2026 / 09:05 AM IST

కొత్త సొసైటీల ఏర్పాటు పై కసరత్తు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. (NLG-42, SRPT-44,YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొత్త గ్రామాలను విడదీసి కొత్త వాటిల్లో విలీనం చేయనున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి

TPT: ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేశారు. దర్శనం అనంతరం ధూర్జటి కళా ప్రాంగణంలో విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతిసారి స్వామి వారిని దర్శించుకోవడం నా భాగ్యమని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగ్గా అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు.

February 24, 2026 / 09:04 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’

KDP: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తు వదిలించేలా స్వయంగా నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

రీ-ఓపెన్ అర్జీలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

NDL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీ-ఓపెన్ అయ్యామన్నారు.

February 24, 2026 / 09:04 AM IST

నరసాపురం డిపోలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన

W.G: ఆర్టీసీలోని 12 డిపోలను పినాకిల్ సంస్థకు అప్పగించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ నరసాపురం డిపో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. NMUA పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:02 AM IST

ఒంగోలులో శక్తి యాప్‌పై అవగాహన

ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, టౌన్ పరిసర ప్రాంతాలలో సోమవారం పోలీసులు మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్‌ని డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను పోలీసులు వివరించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే, వారు వెంటనే మహిళల వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని తెలిపారు.

February 24, 2026 / 09:02 AM IST

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

GDWL: గద్వాల ఇలవేల్పు జమ్మిచేడు గ్రామంలోని జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శోభయామానంగా అలంకరించి, భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసింది.

February 24, 2026 / 09:01 AM IST

చిప్పగిరిలో జనసేన కార్యకర్తలకు పిలుపు..!

KRNL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే చిప్పగిరిలో కార్యకర్తలు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ కన్వినర్ చిరంజీవి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. యువత, మహిళలను పార్టీలో చురుకుగా భాగస్వాముల్ని చేయడం ద్వారా జనసేనకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.

February 24, 2026 / 09:01 AM IST

‘అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి’

KNR: సుడా పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నగరం, పరిసర గ్రామాల ప్రధాన రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు పెద్దపీట వేయాలన్నారు. వర్టికల్ గార్డెన్లు, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.

February 24, 2026 / 09:00 AM IST