KNR: సుడా పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నగరం, పరిసర గ్రామాల ప్రధాన రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు పెద్దపీట వేయాలన్నారు. వర్టికల్ గార్డెన్లు, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.