VZM: వేగ నియంత్రణ కోసం స్టాపర్లు ఏర్పాటు చేసామని డెంకాడ SI సన్యాసి నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక PS పరిధిలో NHపై 10 చోట్ల ఏర్పాటు చేసిన స్టాపర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనాల వేగం తగ్గించేందుకు జింగ్ జాగ్ స్టాపర్లు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
W.G: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో మొగల్తూరు ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ నయీం అస్మి ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీలు చేపట్టినట్లు సమాచారం. ఎస్సై వై.నాగలక్ష్మిని డీసీఆర్బీకి, కానిస్టేబుల్ రాంబాబు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు, కానిస్టేబుల్ రాజేశ్ను ఆకివీడు స్టేషన్కు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
NDL: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 26న ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DSDO శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 1,250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని ఆయన సూచించారు.
ATP: గుంతకల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభమయ్యే హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ సిబ్బంది విధిగా హాజరుకావాలని సూచించారు.
JGL: గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లె గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడడంతో లంబడిపల్లెకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
WNP: హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు ఆన్లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె. హరిత చెప్పారు. కలెక్టరేట్లో తహశీల్దార్లు, అటవీ అధికారులు, BSNL , ఎయిర్ టెల్, జియో, టీ ఫైబర్ ప్రతినిధులతో సెల్ టవర్ నిర్మాణాలు, ఇంటర్నెట్ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని అనుమతులు, స్థలాల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
KMR: కామారెడ్డి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కో -ఆప్షన్ పదవులపై పడింది. ప్రస్తుతం ఈ ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త పాలకవర్గం కొలువదీరిన వెంటనే కో-ఆప్షన్ పదవులను నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేసన్ జారీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
MDCL: ప్రజలకు నీటి సరఫరా చేసే ముందుగా నాణ్యత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జలమండలి ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద మేడిపల్లి ప్రాంతంలో సోలార్ క్లోరినేటర్ మీటర్లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ లెట్, అవుట్ లేట్ పైపులకు అమరిచిన తరువాత రెండుసార్లు నాణ్యత పరీక్షలు చేయనున్నారు.
ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, స్మరణ్ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా చూడాలి.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కోటపహాడ్ నర్సరీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం మొక్కల పెంపకానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. నర్సరీలోని మొక్కలకు సకాలంలో నీళ్లు పోయకపోవడంతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని ఈ పక్షులు జీవిస్తాయి.
KRNL: చిలకలడోన గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలని ఎస్సీ కాలనీవాసులు జిల్లా సబ్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనపరచి, స్థలంలేని నిరుపేద కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
BHPL: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ భవనంలో నేటి నుంచి పంచాయతీ సర్పంచులకు మూడో విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మహాముత్తారం, మలహర్, పలిమెల మండలాలకు చెందిన సర్పంచులకు ఈ తుది విడత శిక్షణ 28వ తేదీ వరకు జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థ బలోపేతం, అభివృద్ధి పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.