ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.