BSK: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్పుతో పాటు నిరుపేదలకు ఉపాధి హామీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతుందని తెలిపారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.