GNTR: ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమమే ‘మన మిత్ర–వాట్సాప్ గవర్నెన్స్’ అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సేవల ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే తమ మొబైల్ ఫోన్లలోనే సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.