KNR: పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలని, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ సూచించారు. ఇల్లందకుంట రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త జే. విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పంటల సంరక్షణ, యూరియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులపై వివరించారు.