AP: గతంలో చెప్పిన అబద్ధాలనే జగన్ మళ్లీ చెప్పారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. YCP హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని ఆరోపించారు. నెట్ బారోయింగ్ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు.