WNP: మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా జడ్జి ఎం.ఆర్ సునీత అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే ఉత్తమమై కక్షిదారులు తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేలా చూడాలని న్యాయవాదులకు సూచించారు.