AKP: కసింకోట మండలంలో ఇప్పటివరకు రూ.2.61 కోట్లు పైగా ఇంటి పన్నుల వసూళ్లు చేసినట్లు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. గురువారం తేగాడ, జోగారావుపేట, బయ్యవరం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నుల వసూళ్లు చేసామన్నారు. మొత్తం డిమాండు రూ.3.67 కోట్లు ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు.