JGL: కోరుట్ల పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.