AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని పరిశీలించి, పారిశుధ్య కార్మికులకు సూచనలు సలహాలు ఇచ్చారు. తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరుచేయాలో వివరించారు. అనంతరం తిమ్మాపురం, రామయ్యపట్నంలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు.