MNCL: తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జును జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. గురువారం చేత కూడా గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ ప్రారంభానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
PLD: అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలో 2,40,530 మంది రైతులకు రూ. 135.48 కోట్ల ఆర్థిక సహాయం అందనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా గురువారం తెలిపారు. ఈ విడతలో రైతులకు రూ. 6,000ల చొప్పున జమ అవుతుందన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అవసరాలకు వినియోగించుకోవాలన్నారు.
SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉప ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి అసిస్టెంట్ కమిషనర్ టైమ్ స్కేల్ మంజూరైంది. పారువెల్లి భాను, కేశన్నగారి శ్రీకాంత్, చంద్రగిరి శరత్, నమిలికొండ రాజేశ్వర శర్మ, కటుకూరి వెంకటయ్యలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆలయ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
NTR: తిరువూరు(M), మునుక్కుళ్ళ ZPHS పాఠశాలను డీవైఈవో శ్యాంసుందర్రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి వారికి భయాన్ని పోగొట్టి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరవ్వడం వంటి కొన్ని సూచనలు చేశారు.
KMM: అక్క మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయినా, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని మనసును కదిలించే ఘటన మధిరలో చోటుచేసుకుంది. తీవ్ర మనోవేదన మధ్య కూడా ధైర్యంగా పరీక్ష రాసిన హాసిని పరిస్థితి అక్కడున్న వారందరినీ కదిలించింది. ఆమె పట్టుదల, ధైర్యాన్ని పలువురు నేడు అభినందించారు.
VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలోని మురళి లేఔట్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మామిడి అప్పారావుకు చెందిన మామిడి తోట కాలిపోయింది. సుమారు పదివేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. పొగ తాగి పారవేయడం వల్ల ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం అన్నదాత సుఖీభవ, రైతు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
VSP: ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏయూ ఈఈటీ-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ. నాయుడు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తారన్నారు. సాధారణ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 పరీక్ష రుసుము చెల్లించాలన్నారు.
AP: బలమైన దేశానికి బలహీన ప్రధాని మోదీ అంటూ CPI నారాయణ విమర్శించారు. ‘యుద్ధం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చడమెందుకు.. తిరిగి అక్కడే పట్టాలు ఇవ్వడం ఎందుకు. భూదాన్ బాధితులందరికీ పట్టాలు ఇవ్వాలి. కమ్యూనిస్టులపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రభుత్వ బాధ్యత.. భిక్ష కాదు. కమ్యూనిస్టుల పోరాట ఫలితమే భూపంపిణీ’ అని పేర్కొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,78,462 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 139 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 1983 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
GNTR: జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 5,875 మద్దతు ధర ప్రకటించినా, మార్కెట్లో కేవలం రూ. 4,500 మాత్రమే ధర లభిస్తోందని వారు జేసీకి వివరించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. 53వ డివిజన్, 5వ డివిజన్ పెన్నానది బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 66 కుటుంబాల గురించి చర్చించారు. పెన్నానదికి వరద ఉధృతి వచ్చినప్పుడు వారిని పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.
MHBD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా ప్రజా ప్రతినిధులకు శిక్షణ నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే మురళీనాయక్, తదితరులు ఉన్నారు.
NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని జడ్పీ కార్యాలయంలో ”ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.
KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో నీటి ఎద్దడి ఉన్న కాలనీలను గుర్తించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని, ఎర్రమ్మ కుచ్చలో కొత్త మురికి కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.