ప్రకాశం: మర్రిపూడి మండలంలోని కూచిపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గుండ్ల సముద్రం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వసంత్ కుమార్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణితంలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహంగా నగదు బహుమతి ఇస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎంఈఓ రంగయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.