PPM: జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని సూచించారు. వడ గాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా చిన్నారులు, పశువుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.