• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

21 కిలోల గంజాయి పట్టి వేత

SKLM: జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ సమీపంలో శ్మశాన వాటిక వద్ద శనివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నుంచి 21 కిలోల గంజాయితో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ వివేకానంద వివరించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.

March 30, 2025 / 06:09 AM IST

రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

NTR: వేసవి రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా నరసాపురం(NS)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07153 NS-SMVB రైలును ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు ప్రతి శుక్రవారం, నం. 07154 SMVB-NS మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు.

March 30, 2025 / 05:01 AM IST

‘డీఈఓ ఆఫీసును ముట్టడించిన టీచర్స్’

శ్రీకాకుళం: పట్టణ పరిధిలోని డీఈవో కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల 10 తరగతి పబ్లిక్ పరీక్షలలో సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు, డిబార్ అయిన విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

March 30, 2025 / 04:35 AM IST

టీడీపీ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్

SKLM: టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరడతుంది.

March 30, 2025 / 04:34 AM IST

ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

SKLM: శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది, పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాలను నింపాలని కోరారు. అలాగే ముస్లిం కుటుంబాల్లో ఈ రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

March 30, 2025 / 04:31 AM IST

నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. కాలక్రమేణా ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇడ్లీలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.

March 30, 2025 / 02:18 AM IST

GT vs MI: పీకల్లోతు కష్టాల్లో ముంబై

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తడబడుతోంది. తిలక్ వర్మ (39), సూర్యకుమార్ యాదవ్ (48) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబై 15 బంతుల్లో 68 పరుగులు రాబట్టాల్సి ఉంది.

March 29, 2025 / 11:23 PM IST

ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణి

PDPL: రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు కానుకలను పంపిణీ చేశారు. MLAరాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశామన్నారు.

March 29, 2025 / 08:20 PM IST

మాజీ VRO, VRAల నియామకంపై జీవో జారీ

TG: గ్రామపాలన అధికారులుగా మాజీ VRO, VRAల నియామకంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. విధివిధానాలు, అర్హతలను రెవెన్యూ శాఖ ఖరారు చేసింది. డిగ్రీ అర్హత ఉన్న మాజీ VRO, VRAలను జీపీవోలుగా అవకాశం కల్పించింది. ఇంటర్‌తో పాటు ఐదేళ్లు VRO లేదా VRAలుగా అనుభవం ఉన్నవారిని అర్హులుగా ప్రకటించింది. వీరిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా GPOలుగా ఎంపిక చేయనుంది.

March 29, 2025 / 08:17 PM IST

నాలుగో రోజుకు చేరిన లాయర్ల నిరాహార దీక్ష

PDPL: న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య ఘటనపై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈరోజుతో నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు గొర్రె రమేష్, శైలజ, తిరుపతి రావు, కిషన్ రావు, మురళి, దాట్ల కిరణ్, కుషాన, రజిత పాల్గొన్నారు. వీరికి HMS నాయకులు జక్కుల నారాయణ, సంతోష్, నాన గౌడ్ పలువురు మద్దతు ఇచ్చారు.

March 29, 2025 / 08:17 PM IST

లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్.. గతంలోనే చెప్పిన ధోనీ!

IPLలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇప్పుడు అంతా చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఈ సీజన్‌కు ముందే ధోనీ స్పష్టత ఇచ్చాడు. ‘విరిగిపోని దానిని మళ్లీ అతికించడం ఎందుకు? బ్యాటర్లు మంచిగా పరుగులు చేస్తున్నప్పుడు సమస్య ఏముంది. ఒకటీ, రెండు మ్యాచుల్లో ఫలితం అనుకూలంగా రాకపోయినా.. కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారీ ఇలాగే జరిగితే మాత్రం నా ఆలోచనల్లో మార్పు రావచ్చు’ అని వెల్లడించాడు.

March 29, 2025 / 08:15 PM IST

తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ASR: చింతపల్లి మండలంలోని సాయినగర్ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్యపడాల్ శనివారం మీడియాకు తెలిపారు. చింతపల్లి మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా సాయినగర్లో నివాసం ఉంటున్న గిరిజనులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాయి నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు.

March 29, 2025 / 08:11 PM IST

చేతి వృత్తుల వారికి 200 కిట్లు పంపిణీ

సత్యసాయి: పరిగి మండలం సేవా మందిరంలో శనివారం గ్రామ ఉద్యోగ వికాస యోజన చేతి వృత్తుల వారికి 200 కిట్లను పంపిణీ చేశారు. ఖాది, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 200 ఎలక్ట్రికల్ కుండలు, తయారీ చక్రాలు నాలుగు, పేపర్ ప్లేట్స్ మేకింగ్ టూల్ కిడ్స్ 20, కుట్టు మిషన్లు 20, ఏసి రిపేరు టూల్ కిట్స్ 100, చింతపండు ప్రాసెసింగ్ టూల్ కిట్లు పంపిణీ చేశారు.

March 29, 2025 / 08:10 PM IST

నీటి సమస్య రాకుండా చూసుకోవాలి: కౌశిక్ రెడ్డి

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలోని నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని MLA కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం మిషన్ భగీరథ అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

March 29, 2025 / 08:06 PM IST

మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలు

KNR: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. వీణవంకలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

March 29, 2025 / 08:03 PM IST